బడ్జెట్తో అన్ని వర్గాలకు అన్యాయం: షబ్బీర్ అలీ
ABN , First Publish Date - 2022-02-03T01:03:20+05:30 IST
కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్తో అన్ని వర్గాలకు అన్యాయం జరిగిందని కాంగ్రెస్ నాయకుడు
కామారెడ్డి: కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్తో అన్ని వర్గాలకు అన్యాయం జరిగిందని కాంగ్రెస్ నాయకుడు షబ్బీర్ అలీ అన్నారు. బడ్జెట్తో ప్రజలకు నష్టమే చేకూరిందన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్పై సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు చాలా బాధాకరమన్నారు. భారత రాజ్యాంగాన్ని మారుస్తా అని సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు వెంటనే క్షమాపణ చెప్పాలన్నారు. అలాగే కేసీఆర్ తన సీఎం పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.