తెలంగాణ సంస్కృతి సంప్రదాయలకు ప్రతీక బోనాలు: Indrakaran Reddy
ABN , First Publish Date - 2022-06-30T18:26:25+05:30 IST
గోల్కొండ జగదాంబ మహంకాళి బోనాల ప్రారంభం సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి(Indrakaran Reddy) మాట్లాడుతూ..
Hyderabad : గోల్కొండ జగదాంబ మహంకాళి బోనాల ప్రారంభం సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి(Indrakaran Reddy) మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పడిన తరువాత హైదరాబాద్లో జరిగే బోనాల పండుగను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందని పేర్కొంది. ఈ ఏడాది బోనాలకు ప్రభుత్వం రూ.15 కోట్లు కేటాయించింది. తెలంగాణ సంస్కృతి సంప్రదాయలకు ప్రతీక బోనాలని ఇంద్రకరణ్ పేర్కొన్నారు. ఈ రోజు నుంచి బోనాలు ఉత్సవాలు ప్రారంభమవుతాయన్నారు. ప్రభుత్వం తరుపున గోల్కొండ కోటలో జగదాంబ మహంకాళి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించామని ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు.