ప్రభుత్వాలు మారినా.. పేదల బతుకులు మారలే
ABN , First Publish Date - 2022-04-30T07:35:32+05:30 IST
కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్ పార్టీలకు ఓట్లేస్తే ప్రభుత్వాలు
- బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ ప్రవీణ్ కుమార్
బోనకల్, ఏప్రిల్ 29: కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్ పార్టీలకు ఓట్లేస్తే ప్రభుత్వాలు మారాయి కానీ, ప్రజల తలరాతలు ఇంకా మారలేదని బీఎస్పీ రాష్ట్ర కో ఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఆయన చేపట్టిన బహుజన రాజ్యాధికార యాత్ర శుక్రవారం ఖమ్మం జిల్లా బోనకల్ మండలంలోని తూటికుంట్ల, గోవిందాపురం(ఎల్), గార్లపాడు, రావినూతల, బోనకల్, చినబీరవల్లి, నారాయణపురం గ్రామాల్లో జరిగింది.
ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ మాట్లాడారు. తాను 400 గ్రామాల్లో పర్యటించానని ప్రజలు ఎక్కడా సంతోషంగాలేరని చెప్పారు. జనం కనీస సౌకర్యాల్లేక బాధల్లో ఉంటే ఆధిపత్య వర్గాల పాలకులు మాత్రం బంగళాల్లో విలాస జీవితం గడుతున్నారన్నారు. రూ.లక్షల కోట్ల కాంట్రాక్టులు పొందిన వారిలో బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలవారు లేరని చెప్పారు.