HYD: కొడుకును హత్య చేసిన సవతి తల్లి

ABN , First Publish Date - 2022-05-23T16:12:49+05:30 IST

నగరంలోని కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోల్నాకలో దారుణం జరిగింది. ఏడేళ్ల బాలుడిని సవతి తల్లి హత్య చేసింది.

HYD: కొడుకును హత్య చేసిన సవతి తల్లి

హైదరాబాద్: నగరంలోని కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోల్నాకలో దారుణం జరిగింది. ఏడేళ్ల బాలుడిని సవతి తల్లి హత్య చేసింది. ఉజ్వల్ అనే ఏడేళ్ల బాలుడు 15 రోజుల క్రితం బిల్డింగ్‌పై నుంచి కింద పడ్డాడు. వెంటనే తండ్రి బాలుడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించాడు. ఆ తరువాత ఇంటికి తీసుకురాగా... నిన్న(ఆదివారం) బాలుడు ఇంట్లో చనిపోయాడు. బాలుడి మృతిపై అనుమానం వ్యక్తం చేసిన తండ్రి భాస్కర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టగా అసలు నిజం వెలుగులోకి వచ్చింది. సవతి తల్లి సరిత కొడుకును హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. బిల్డింగ్‌పై నుండి ఉజ్వల్‌ను సవతి తల్లి నెట్టివేసింది. అప్పటికి చనిపోకపోవడంతో ఇంటికి వచ్చిన తరువాత గొంతు నులిమి హత్య చేసింది. సరితను అరెస్టు చేసిన కాచిగూడ పోలీసులు స్టేషన్‌కు తరలించారు. 

Updated Date - 2022-05-23T16:12:49+05:30 IST