ఘోర ప్రమాదం... ముగ్గురు దుర్మరణం
ABN , First Publish Date - 2022-07-05T01:50:03+05:30 IST
నగరంలోని పెద్దగోల్కొండ ఓఆర్ఆర్పై రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ఆగివున్న కంటైనర్ను కారు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు.
హైదరాబాద్: నగరంలోని పెద్దగోల్కొండ ఓఆర్ఆర్పై రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ఆగివున్న కంటైనర్ను కారు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. పెద్దఅంబర్పేట్ నుంచి శంషాబాద్ వెళ్తుండగా ఘటన చోటుచేసుకుంది. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను స్వాధీనం చేసుకుని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.