ఏడుగురు పేకాటరాయుళ్ల అరెస్టు
ABN , First Publish Date - 2022-07-13T04:30:32+05:30 IST
ఏడుగురు పేకాటరాయుళ్ల అరెస్టు
హనుమకొండ క్రైం, జూలై 12: వరంగల్ పోలీసు కమిషనరేట్ మిల్స్కాలనీ పోలీసుస్టేషన్ పరిధిలో పేకాట ఆడుతున్న ఏడుగురిని మంగళవారం వరంగల్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.33వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ఫోర్స్ సీఐ సంతో్షకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం రోడ్డులోని శ్రీసాయి గణేశ్ లారీ ట్రాన్స్పోర్ట్ కార్యాలయం అడ్డాగా కొద్దికాలంగా కొందరు వ్యక్తులు పేకాట ఆడుతున్నట్టు పక్కా సమాచారం అందింది. దీంతో టాస్క్ఫోర్స్ సిబ్బంది మూకుమ్మడిగా దాడి చేసి ఏడుగురిని పట్టుకున్నారు. వారి నుంచి నగదుతో పాటు సెల్ఫోన్స్, ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ దాడులలో టాస్క్ఫోర్స్ పోలీసులతో పాటు మిల్స్కాలనీ పోలీసులు పాల్గొన్నారు.