ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు విచారణ
ABN , First Publish Date - 2022-11-30T13:53:37+05:30 IST
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టులో నేడు విచారణ జరిగింది.
హైదరాబాద్: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టులో నేడు విచారణ జరిగింది. బీజేపీ తరపున సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సిల్ మహేష్ జఠ్మలానీ వాదనలు వినిపించారు. సిట్ దర్యాప్తుపై తమకు నమ్మకం లేదని న్యాయవాది మహేష్ తెలిపారు. రాజకీయ దురుద్దేశంతోనే సిట్ విచారణ జరుగుతోందని మహేష్ పేర్కొన్నారు. ఎమ్మెల్యేలకు ఎర కేసును సీబీఐతో దర్యాప్తు జరిపించాలని పేర్కొన్నారు. ఎఫ్ఐఆర్లో పోలీసులు రూల్స్ ఫాలో కాలేదని న్యాయవాది మహేష్ పేర్కొన్నారు.