TS News: బీజేపీ నేతలు ఎవరి కోసం ఉపఎన్నికలు తెస్తారో చెప్పాలి: హరీష్రావు
ABN , First Publish Date - 2022-08-01T23:32:45+05:30 IST
ఉపఎన్నిక తెస్తామని బీజేపీ నేతలు అంటున్నారని, తాము తెలంగాణ కోసం పదవులకు రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లామని మంత్రి హరీష్రావు తెలిపారు.
మెదక్: ఉపఎన్నిక తెస్తామని బీజేపీ నేతలు అంటున్నారని, తాము తెలంగాణ కోసం పదవులకు రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లామని మంత్రి హరీష్రావు తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీ నేతలు ఎవరి కోసం ఉపఎన్నికలు తెస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ నిధులకు కేంద్రం కోత వేయాలని చూస్తోందని మండిపడ్డారు. తెలంగాణకు కేంద్రం ఏమీ చేయడం లేదని దుయ్యబట్టారు. రాజకీయాల కోసమే తెలంగాణను బీజేపీ వాడుకుంటోందని హరీష్రావు మండిపడ్డారు.