గ్రేటర్ హైదరాబాద్లో పంజా విసురుతున్న కరోనా
ABN , First Publish Date - 2022-01-21T16:51:36+05:30 IST
గ్రేటర్ హైదరాబాద్లో కరోనా పంజా విసురుతోంది. సంక్రాంతి పండుగ అనంతరం కోవిడ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. అత్యధికంగా ఉప్పల్లో నిన్న ఒక్క రోజే 497 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్లో కరోనా పంజా విసురుతోంది. సంక్రాంతి పండుగ అనంతరం కోవిడ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. అత్యధికంగా ఉప్పల్లో నిన్న ఒక్క రోజే 497 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్న కూకట్పల్లిలో 450 పైగా కేసులు నమోదయ్యాయి. కుత్బుల్లాపూర్లో సైతం అదే స్థాయిలో కేసులు నమోదయ్యాయి. రెండు రోజుల వ్యవధిలో 300 మంది జీహెచ్ఎంసీ ఉద్యోగులకు పాజిటివ్గా నిర్ధారణ అయింది. టెస్టింగ్ కేంద్రాల వద్ద తెల్లవారుజాము నుంచే జనం క్యూ కడుతున్నారు. జ్వరం, జలుబు లాంటి లక్షణాలతో టెస్టింగ్ కేంద్రాలకు ప్రజలు పరుగులు పెడుతున్నారు. కేసులు పెరుగుతున్న ప్రాంతాలపై బల్దియా స్పెషల్ ఫోకస్ పెట్టింది. రద్దీ ప్రాంతాల్లో స్ప్రేయింగ్ కోసం 100కు పైగా శానిటేషన్ బృందాలను అధికారులు ఏర్పాటు చేశారు.