TS news: కాళేశ్వరం వద్ద క్రమక్రమంగా పెరుగుతున్న గోదావరి

ABN , First Publish Date - 2022-07-28T16:24:37+05:30 IST

కాళేశ్వరం వద్ద గోదావరి వరద ప్రవాహం క్రమక్రమంగా పెరుగుతోంది.

TS news: కాళేశ్వరం వద్ద క్రమక్రమంగా పెరుగుతున్న గోదావరి

జయశంకర్ భూపాలపల్లి: కాళేశ్వరం(Kaleshwaram) వద్ద గోదావరి వరద ప్రవాహం క్రమక్రమంగా పెరుగుతోంది. ప్రధాన పుష్కరఘాట్ వద్ద 11.040 మీటర్ల ఎత్తులో ప్రవహం కొనసాగుతోంది. అధికారులు లక్ష్మీ(మేడిగడ్డ)(Medigadda) బ్యారేజీలోని మొత్తం 85 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 7,31,240 క్యూసెక్కులుగా ఉంది. సరస్వతి(అన్నారం)(Saraswathi barrage) బ్యారేజీలోని మొత్తం 66 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 1,93,613 క్యూసెక్కులుగా నమోదు అయ్యింది. బ్యారేజీ పూర్తి సామర్థ్యం 10.87 టీఎంసీలకు గాను ప్రస్తుత నీటి మట్టం 0.44 టీఎంసీలకు చేరింది. 

Updated Date - 2022-07-28T16:24:37+05:30 IST