వైఎస్‌ షర్మిలతోనే సువర్ణ పాలన

ABN , First Publish Date - 2022-10-23T00:55:31+05:30 IST

వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల నేతృత్వంలో తెలంగాణలో సువర్ణ పాలన వస్తుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎండీ. అథహర్‌ అన్నారు.

వైఎస్‌ షర్మిలతోనే సువర్ణ పాలన

భువనగిరి టౌన్‌, అక్టోబరు 22: వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల నేతృత్వంలో తెలంగాణలో సువర్ణ పాలన వస్తుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎండీ. అథహర్‌ అన్నారు. భువనగిరిలో శనివారం జరిగిన సమావేశంలో మాట్లాడారు. మాజీ సీఎం వైఎస్సార్‌ ఆశయాల సాధనే లక్ష్యంగా వైఎస్సార్‌టీపీ పని చేస్తుంద న్నారు. పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడిగా సుర్వి వెంకటేశ్‌గౌడ్‌, మైనార్టీ సెల్‌ జిల్లా అధ్యక్షుడిగా షకిల్‌, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడిగా లింగాచారి, ఆలేరు అసెంబ్లీ కోఆర్డి నేటర్‌గా గ్యార నరేష్‌, భువనగిరి పట్టణ అధ్యక్షుడిగా సాయి నివాస్‌, మైనార్టీ అధ్యక్షుడిగా వాహేద్‌కు నియామక పత్రాలు అందజేశారు.

Updated Date - 2022-10-23T01:02:32+05:30 IST