జీహెచ్ఎంసీ స్పోర్ట్స్ సమ్మర్ క్యాంప్లను ప్రారంభించిన మేయర్
ABN , First Publish Date - 2022-04-25T14:34:11+05:30 IST
నగరంలోని విక్టోరియా ప్లేగ్రౌండ్లో జీహెచ్ఎంసీ స్పోర్ట్స్ సమ్మర్ క్యాంప్లను మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ సోమవారం ఉదయం ప్రారంభించారు.
హైదరాబాద్: నగరంలోని విక్టోరియా ప్లేగ్రౌండ్లో జీహెచ్ఎంసీ స్పోర్ట్స్ సమ్మర్ క్యాంప్లను మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ సోమవారం ఉదయం ప్రారంభించారు. నేటి నుంచి నగర వ్యాప్తంగా 854 ప్లే గ్రౌండ్లలో, 44 క్రీడల్లో శిక్షణ తరగతులు మొదలవనున్నాయి. చిన్నారుల్లో క్రీడా నైపుణ్యాన్నిపెంపొందించేందుకు వేసవి క్రీడా శిక్షణ తరగతులను ఏర్పాటు చేశారు. రూ.1.20 కోట్ల విలువగల స్పోర్ట్ మెటీరియల్తో శిక్షణా తరగతులు ఏర్పాటయ్యాయి. 800 మంది కోచ్లతో జీహెచ్ఎంసీ శిక్షణా తరగతులు నిర్వహించనుంది. నేటి నుండి ప్రారంభమై మే 31న ట్రైనింగ్ క్యాంప్ ముగియనుంది.