షర్మిల పార్టీలోకి గట్టు రామచంద్రరావు
ABN , First Publish Date - 2022-01-03T00:04:26+05:30 IST
షర్మిల పార్టీలోకి మాజీ టీఆర్ఎస్ నేత గట్టు రామచంద్రరావు చేరనున్నారు. సోమవారం వైఎస్ షర్మిల సమక్షంలో రామచంద్రరావు పార్టీలో చేరుతారని చెబుతున్నారు.
హైదరాబాద్: షర్మిల పార్టీలోకి మాజీ టీఆర్ఎస్ నేత గట్టు రామచంద్రరావు చేరనున్నారు. సోమవారం వైఎస్ షర్మిల సమక్షంలో రామచంద్రరావు పార్టీలో చేరుతారని చెబుతున్నారు. టీఆర్ఎస్లో ఉద్యమకారులకు ప్రాధాన్యత లేదంటూ ఇటీవల టీఆర్ఎస్కు రాజీనామా గట్టు రామచంద్రరావు చేశారు. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికలలో తనకు అవకాశం కల్పిస్తారని రామచంద్రరావు ఆశించారు. అయితే గట్టుకు కాకుండా తాతా మధుకు ఆ స్థానాన్ని సీఎం కేసీఆర్ కేటాయించారు. దీంతో తీవ్రంగా మనస్తాపం చెందిన గట్టు రాజీనామా చేశారని తెలుస్తోంది. గతంలో వామపక్ష పార్టీలో క్రియాశీలకంగా గట్టు పనిచేశారు. తరువాత వైసీపీలో చేరి కీలక నేతగా ఎదిగారు. అనంతరం టీఆర్ఎస్లో చేరి కేసీఆర్కు నమ్మినబంటుగా మారారు. ఇప్పుడు వైఎస్ఆర్టీపీలో చేరబోతున్నారు.