Hyderabad: జూ పార్కులోకి చేరిన వరద నీరు

ABN , First Publish Date - 2022-07-13T15:46:28+05:30 IST

నగరంలో గత ఐదురోజులుగా ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలకు మిరాలం చెరువు పూర్తి నిండిపోయింది.

Hyderabad: జూ పార్కులోకి చేరిన వరద నీరు

హైదరాబాద్: నగరంలో గత ఐదురోజులుగా ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలకు మిరాలం చెరువు పూర్తి నిండిపోయింది. దీంతో జూ పార్కులోని సఫారీ కాంప్లెక్స్‌లోకి వరద పోటెత్తింది. ఈ క్రమంలో సందర్శకులు వెళ్లకుండా జూలోని సఫారీ కాంప్లెక్స్ అధికారులు మూసివేశారు. మిగిలిన జూ పార్క్‌లోకి యథావిధిగా సందర్శకులకు అనుమతి ఇస్తున్నారు. కాగా... సఫారీ జోన్‌లోని జంతువులు నైట్ ఎన్‌క్లోజర్‌లో సేఫ్‌గా ఉన్నాయని జూ అధికారులు తెలిపారు. 

Updated Date - 2022-07-13T15:46:28+05:30 IST