సీఎంఆర్ గడువు పొడిగించండి
ABN , First Publish Date - 2022-03-23T08:36:48+05:30 IST
గత యాసంగి బియ్యానికి సంబంధించిన కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) గడువును పొడిగించాలని భారత ఆహార సంస్థ (ఎఫ్సీఐ) కు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ లేఖ రాసింది.
ఎఫ్సీఐకి పౌరసరఫరాల శాఖ లేఖ
హైదరాబాద్, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): గత యాసంగి బియ్యానికి సంబంధించిన కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) గడువును పొడిగించాలని భారత ఆహార సంస్థ (ఎఫ్సీఐ) కు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ లేఖ రాసింది. గడువును ఏప్రిల్ నెలాఖరు వరకు పొడిగించాలని కోరింది. ఈ నెలాఖరుకు సీఎంఆర్ డెడ్లైన్ ముగియనుంది. గత యాసంగికి సంబంధించి 62.52 లక్షల టన్నుల బియ్యం ఇవ్వాల్సి ఉండగా.. ఇప్పటికే 54 లక్షల టన్నుల బియ్యాన్ని ఎఫ్సీఐకి అందించారు. మిగిలిన 8.52 లక్షల టన్నుల బియ్యాన్ని ఇవ్వాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే సీఎంఆర్ గడువును పొడిగించాలని ఎఫ్సీఐకి పౌరసరఫరాల శాఖ మంగళవారం లేఖ రాసింది.