తెలంగాణలో మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది: ఈటల
ABN , First Publish Date - 2022-01-09T20:35:08+05:30 IST
సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఆరిపోయే దీపం లాంటిదని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ జోస్యం చెప్పారు. ఆదివారం ఆయన మీడియాతో
హన్మకొండ: సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఆరిపోయే దీపం లాంటిదని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ జోస్యం చెప్పారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 2023 వరకు కేసీఆర్ ప్రభుత్వం ఉండకపోవచ్చన్నారు. మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని జోస్యం చెప్పారు. హుజురాబాద్ పరిస్థితే తెలంగాణ అంతటా పునరావృతం అవుతుందని, కేసీఆర్ సర్కార్కి ప్రజలు ఘోరి కట్టడం ఖాయమని ఈటల రాజేందర్ హెచ్చరించారు.
తెలంగాణ మధ్యంతర ఎన్నికలు వస్తాయని బీజేపీ నేతలు పదేపదే చెబుతున్నారు. టీఆర్ఎస్ తామే ప్రత్యామ్నాయం అని కాషాయ నేతలు ధీమా వ్యక్తం చేశారు. ఇటీవల తెలంగాణలో మధ్యంతర ఎన్నికలు వస్తాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ జోస్యం చెప్పారు. కేసీఅర్ అవినీతి ప్రభుత్వం కూలిపోతుందని, ఎన్నికలు తప్పవని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జైలుకు పోవటం ఖాయమని సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.