విద్యా వాలంటీర్లను రెన్యువల్‌ చేయాలి

ABN , First Publish Date - 2022-08-20T10:14:40+05:30 IST

రాష్ట్రంలో విద్యావాలంటీర్లను రెన్యువల్‌ చేయాలని, వారికి బకాయి ఉన్న 3 నెలల వేతనాలను తక్షణం చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని టీపీసీసీ మాజీ అధికార ప్రతినిధి జి.హర్షవర్ధన్‌ రెడ్డి, యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడు శివ సేనా రెడ్డి కోరారు.

విద్యా వాలంటీర్లను రెన్యువల్‌ చేయాలి

వేతన బకాయిలు చెల్లించాలి: కాంగ్రెస్‌ నేతల వినతి 

హైదరాబాద్‌, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో విద్యావాలంటీర్లను రెన్యువల్‌ చేయాలని, వారికి బకాయి ఉన్న 3 నెలల వేతనాలను తక్షణం చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని టీపీసీసీ మాజీ అధికార ప్రతినిధి జి.హర్షవర్ధన్‌ రెడ్డి, యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడు శివ సేనా రెడ్డి కోరారు. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర విద్యా శాఖ ముఖ్య కార్యదర్శికి వినతి పత్రం అందజేసినట్టు తెలిపారు. విద్యా సంవత్సరం ప్రారంభమై నెలలు గడుస్తున్నా  ఉపాధ్యాయులులేక లక్షలాది మంది పేద విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారని వారు పేర్కొన్నారు. గతంలో పనిచేసిన 9,500 మంది విద్యా వా లంటీర్లను కొనసాగించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. 

Updated Date - 2022-08-20T10:14:40+05:30 IST