డ్రగ్స్ కేసులో ముగిసిన విచారణ
ABN , First Publish Date - 2022-04-22T00:38:01+05:30 IST
బంజారాహిల్స్ రాడిసన్ బ్లూలోని ఫుడింగ్ అండ్ మింక్ పబ్ కేసులో పోలీసుల విచారణ ముగిసింది. డ్రగ్స్ వినియోగదారులు సంజయ్
హైదరాబాద్: బంజారాహిల్స్ రాడిసన్ బ్లూలోని ఫుడింగ్ అండ్ మింక్ పబ్ కేసులో పోలీసుల విచారణ ముగిసింది. డ్రగ్స్ వినియోగదారులు సంజయ్, శశికాంత్లను 7 గంటలపాటు బంజారాహిల్స్ పోలీసులు ప్రశ్నించారు. పబ్లో దొరికిన డ్రగ్స్, ఈ కేసులో నిందితులు టోని, అభిషేక్తో సంబంధాలపై ఆరా పోలీసులు ఆరా తీశారు. ఎప్పుడు పిలిచినా విచారణకు రావాలని సంజయ్, శశికాంత్లను పోలీసుల ఆదేశించారు. శుక్రవారం మరో ముగ్గురిని పోలీసులు ప్రశ్నించనున్నారు. ఇటీవల పబ్ కేసులో నిందితులు పబ్ నిర్వాహకుడు అభిషేక్, మేనేజర్ అనిల్ను పోలీసులు 4 రోజులు విచారించారు. నాలుగు రోజుల్లో నిందితులు పోలీసులకు సహకరించపోవడంతో ఈ కేసును కొలిక్కి తీసుకురావడం పోలీసులకు పెద్ద సవాలుగా మారింది. పబ్పై దాడులు, నిందితుల అరెస్టు తర్వాత అనేక పరిణామాలు చోటు చేసుకున్నప్పటికీ అవి కేసుకు బలాన్ని ఇచ్చేలా లేకపోవడం పోలీసులకు ఇబ్బందిగా మారింది.