ఉట్నూర్ కేజీబీవీలో విద్యార్థిని మృతి.. ఉద్రిక్తత
ABN , First Publish Date - 2022-08-10T10:15:36+05:30 IST
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్లోని కేజీబీవీలో పదో తర గతి విద్యార్థిని కవిత (15) చనిపోయింది.
అనారోగ్యం వల్లేనన్న పాఠశాల సిబ్బంది
దర్యాప్తు కోసం తల్లిదండ్రుల డిమాండ్
ఉట్నూర్, ఆగస్టు 9: ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్లోని కేజీబీవీలో పదో తర గతి విద్యార్థిని కవిత (15) చనిపోయింది. కవిత అనారోగ్యంతో చనిపోయిందని పాఠశాల సిబ్బంది చెప్తున్నారు. తమ కుమార్తె మృతిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాలని కవిత తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. దీంతో ఉద్రిక్తతకు దారితీసింది. దంతన్పల్లి జెండాగూడకు చెందిన కవిత సోమవారం అర్ధరాత్రి తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో.. పాఠశాల సిబ్బంది చికిత్స నిమిత్తం ఆదిలాబాద్లోని రిమ్స్లో చేర్పించారు. మంగళవారం తెల్లవారుజామున కవిత చనిపోయింది. విద్యార్థిని తల్లిదండ్రులు పాఠశాల సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనారోగ్యంగా సమాచారం ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. విద్యార్థిని మృతదేహంతో ఐటీడీఏ ఎదుట ఆందోళనకు దిగారు. బాధ్యులైన వారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని ఐటీడీఏ పీవో వరుణ్రెడ్డి హామీ ఇచ్చారు.