Narayana comments: ఎంత మంచోడైనా బీజేపీని ఓడించడమే మా లక్ష్యం
ABN , First Publish Date - 2022-08-19T20:24:38+05:30 IST
మునుగోడు తమకు బలమైన ప్రాంతమని సీపీఐ నేత నారాయణ అన్నారు.
హైదరాబాద్: మునుగోడు (Munugodu by poll) తమకు బలమైన ప్రాంతమని సీపీఐ నేత నారాయణ (Narayana) అన్నారు. శుక్రవారం ఏబీఎన్తో మాట్లాడుతూ... ‘‘మా ముందు మూడు ఆప్షన్స్ ఉన్నాయి. వీటిలో రేపు ఏదో ఒక నిర్ణయం తీసుకుంటాం’’ అని చెప్పారు. ఎంత మంచోడైనా బీజేపీ (BJP)ని ఓడగొట్టడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటిదాకా రాజకీయపరమైన డెసిషన్ తీసుకోలేదన్నారు. రాష్ట్ర మహాసభల్లో సీపీఐ నాయకులు (CPI Leaders) బిజీగా ఉన్నామని... అందుకే కాంగ్రెస్ (Congress) నాయకులను కలవడం లేదని తెలిపారు. సీపీఐ పార్టీ బలోపేతానికి ఉపయోగపడే నిర్ణయం తీసుకుంటామన్నారు. విమర్శలతో తమకు సంబంధం లేదని...తాము ఎవరికి మద్దతు ఇవ్వాలనుకుంటున్నామో వాళ్లకే ఇస్తామని నారాయణ పేర్కొన్నారు.