రోడ్డు ప్రమాదంలో దంపతుల మృతి
ABN , First Publish Date - 2022-02-26T02:30:55+05:30 IST
జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. కోహీర్
సంగారెడ్డి: జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. కోహీర్ మండలం కొత్తూర్(డి) దగ్గర స్కూటీని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో దంపతులు మృత్యువాత పడ్డారు. మృతులను కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ జిల్లా ఉద్గిర్ తాలూకా కాసింపూర్కు చెందిన నాగయ్యస్వామి, జయశ్రీగా గుర్తించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.