స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డికి కరోనా
ABN , First Publish Date - 2022-01-17T00:28:25+05:30 IST
స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డికి కరోనాతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. శనివారం కరోనా లక్షణాలు కనిపించడంతో టెస్టు చేయించుకోగా
బాన్సువాడ: స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డికి కరోనాతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. శనివారం కరోనా లక్షణాలు కనిపించడంతో టెస్టు చేయించుకోగా కరోనా పాటిజివ్గా నమోదైనట్లు వైద్యులు తెలిపారు. ఎటువంటి సమస్యలు లేనప్పటికీ వైద్యుల సూచనల మేరకు హైదరాబాద్లోని గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రిలో చేరినట్లు వైద్యులు తెలిపారు. గత కొన్ని రోజులుగా తనను కలిసిన వారు, సన్నిహితంగా ఉన్న వారు కొవిడ్ టెస్టు చేయించుకోవాలని సూచించారు. పాజిటివ్ వచ్చిన వారు తగు జాగ్రత్తలతో హోం ఐసోలేషన్లో ఉండాలని స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి సూచించారు.
గత ఏడాది నవంబరు 26న శ్రీనివాస్రెడ్డికి కరోనా సోకింది. నవంబరులో పోచారం మనవరాలి వివాహం హైదరాబాద్లో జరిగింది. ఆ సమయంలో ఆయనకు కరోనా సోకింది. పోచారం రెండు కరోనా టీకా డోసులు వేసుకున్నారు. అయినా ఆయన తిరిగి కరోనాబారిన పడ్డారు.