బాలిక రేప్ కేసును సీబీఐకి అప్పగించాలి: Sridhar babu
ABN , First Publish Date - 2022-06-04T18:35:42+05:30 IST
నగరంలో సంచలనం సృష్టించిన బాలిక రేప్ కేసును సీబీఐకి అప్పగించాలని కాంగ్రెస్ నేత దుద్దిళ్ల శ్రీధర్ బాబు డిమాండ్ చేశారు.
హైదరాబాద్: నగరంలో సంచలనం సృష్టించిన బాలిక రేప్ కేసును సీబీఐకి అప్పగించాలని కాంగ్రెస్ నేత దుద్దిళ్ల శ్రీధర్ బాబు డిమాండ్ చేశారు. ఇక్కడి వ్యవస్థపై ప్రజలకు నమ్మకం లేదన్నారు. ప్రభుత్వ నిర్లిప్తత వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని మండిపడ్డారు. మర్డర్, రేప్లు జరుగుతున్నా దోషులను పట్టుకోవడం లేదని, వారు బయట దర్జాగా తిరుగుతున్నారని శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.