ఇలా అయితే కిడ్నాప్‌లు, మర్డర్లే: రేణుకా చౌదరి

ABN , First Publish Date - 2022-03-03T22:54:52+05:30 IST

ధరణి కారణంగా వచ్చిన భూ సమస్యలను పరిష్కరించకపోతే అందరూ

ఇలా అయితే కిడ్నాప్‌లు, మర్డర్లే: రేణుకా చౌదరి

హైదరాబాద్: ధరణి కారణంగా వచ్చిన భూ సమస్యలను పరిష్కరించకపోతే అందరూ కిడ్నాప్‌లు, మర్డర్లే చేస్తారని కాంగ్రెస్ నేత రేణుకా చౌదరి అన్నారు. నగరంలో ఆమె మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో రక్షణ కరువైందన్నారు. కిడ్నాప్‌లు, హత్యలు మామూలు అయిపోయాయని ఆమె అన్నారు. ల్యాండ్ డీల్స్‌కు తెలంగాణ కేంద్రంగా మారిందని ఆమె ఆరోపించారు. దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. ధరణి పోర్టల్‌తో రైతులు నష్టపోతున్నారన్నారు. ఎప్పుడో అమ్మిన భూముల యాజమాన్య హక్కులు మారడం లేదన్నారు. దీంతో రైతులపై రియల్ ఎస్టేట్ మాఫియా  దౌర్జన్యం చేస్తుందని ఆమె పేర్కొన్నారు. తెలంగాణ స్టార్టప్ అంటే ఇదేనా అని ఆమె ప్రశ్నించారు. టెక్నాలజీ మంచిదే కానీ అదే టెక్నాలజీ ఇన్ని ఇబ్బందులు సృష్టిస్తుందన్నారు. గతంలో ఇంటర్ పరీక్షా ఫలితాలు కూడా తప్పుల తడకే అని, అధికారులు ఏం చేస్తున్నారని ప్రభుత్వాన్ని ఆమె నిలదీశారు. 

Updated Date - 2022-03-03T22:54:52+05:30 IST