పాలేరు ఎమ్మెల్యేపై భట్టి విక్రమార్క ఆగ్రహం

ABN , First Publish Date - 2022-02-13T04:16:08+05:30 IST

పాలేరు ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డిపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి టీఆర్ఎస్‌లోకి వెళ్లడాన్ని ఆయన తీవ్రంగా తప్పు బట్టారు. ఉపేందర్ రెడ్డి...

పాలేరు ఎమ్మెల్యేపై భట్టి విక్రమార్క ఆగ్రహం

ఖమ్మం: పాలేరు ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డిపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి టీఆర్ఎస్‌లోకి వెళ్లడాన్ని ఆయన తీవ్రంగా తప్పు బట్టారు. ఉపేందర్ రెడ్డి పాలేరు ప్రజలకు ద్రోహం చేసి కాంట్రాక్టుల కోసం పార్టీ మారాడని ఆరోపించారు. ‘‘ఉపేందర్ రెడ్డి లాంటి వారు పార్టీకి ద్రోహం చేసినా ఇంకా పాలేరులో మూడు రంగుల జెండా రెపరెపలాడుతూనే ఉంది. పాలేరులో ఇంతవరకు కాంగ్రెస్ నుంచి గెలిచిన వారెవరూ పార్టీకి ద్రోహం చేయలేదు. రానున్న ఎన్నికల్లో అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. దేశం కోసం ప్రాణాలర్పించిన ఇందిరమ్మ మనవడు రాహుల్ గాంధీ గురించి నీచంగా మాట్లాడిన సంస్కృతి బీజేపీ పార్టీది.’’ అని భట్టి విమర్శించారు. 


Updated Date - 2022-02-13T04:16:08+05:30 IST