Jairam Ramesh: కేసీఆర్కు BRS సమయం కాదు.. VRS సమయం
ABN , First Publish Date - 2022-10-05T02:47:51+05:30 IST
ప్రజలను సంఘటితం చేయడానికే కాంగ్రెస్ భారత్ జోడో యాత్ర...
హైదరాబాద్: ప్రజలను సంఘటితం చేయడానికే కాంగ్రెస్ భారత్ జోడో యాత్ర (Congress Bharat JOdo Yatra) అని కాంగ్రెస్ ఏఐసీసీ నేత జైరాం రమేశ్ అన్నారు. ఈనెల 6న రాహుల్ పాదయాత్రలో సోనియా గాంధీ (Sonia Gandhi) పాల్గొననున్నారని ఆయన తెలిపారు. త్వరలో తెలుగు రాష్ట్రాల్లో రాహుల్ భారత్ జోడో యాత్ర జరగబోతోంది. ఈ మేరకు తెలంగాణ కాంగ్రెస్ నేతలతో సన్నాహక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జైరామ్ రమేశ్ మాట్లాడుతూ ఏపీలో 62, తెలంగాణలో 360 కిలో మీటర్ల మేర రాహుల్ పాదయాత్ర చేయబోతున్నట్లు పేర్కొన్నారు. ఏపీలో 4 రోజుల పాటు రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తారని వెల్లడించారు. ఈనెల 24న తెలంగాణలో రాహుల్ పాదయాత్ర చేయనున్నారని తెలిపారు. తెలంగాణలో ప్రజలకు రెండు మెసేజ్లు రానున్నాయని.. బీజేపీ, టీఆర్ఎస్ విధానాలపై యాత్ర జరుగుతుందన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ ఒకే నాణేనికి రెండు వైపుల్లాంటివని చెప్పారు. సీఎం కేసీఆర్కు ఇది BRS సమయం కాదని.. VRS సమయం అని జైరాం రమేశ్ ఎద్దేవా చేశారు.