చింతమనేని ఆధ్వర్యంలో కోడిపందాలు.. 21 మంది అరెస్ట్

ABN , First Publish Date - 2022-07-07T17:00:45+05:30 IST

పటాన్‌చెరు మండలం చినకంజర్లలో కోడిపందాలు పెద్ద ఎత్తున కోడి పందేలు జరిగాయి. 21 మంది పందెం రాయుళ్లను అరెస్ట్‌ చేశారు.

చింతమనేని ఆధ్వర్యంలో కోడిపందాలు.. 21 మంది అరెస్ట్

Sangareddy : పటాన్‌చెరు మండలం చినకంజర్లలో కోడిపందాలు పెద్ద ఎత్తున కోడి పందేలు జరిగాయి. 21 మంది పందెం రాయుళ్లను అరెస్ట్‌ చేశారు. 31 కోళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌(Chintamaneni Prabhakar)తో పాటు మరో 40 మంది పరారీలో ఉన్నారు. రూ.13.21 లక్షలు, 26 వాహనాలు, 27 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకుని.. పందాలకు ఉపయోగించిన 30 కత్తులను పోలీసులు సీజ్‌ చేశారు. దీనిపై పటాన్‌చెరు డీఎస్పీ మాట్లాడుతూ.. 70 మంది కోడిపందేల్లో పాల్గొన్నారన్నారు. చింతమనేని ప్రభాకర్‌ నేతృత్వంలోనే కోడిపందాలు జరిగాయన్నారు. అక్కినేని సతీష్‌, కృష్ణంరాజు, బర్ల రాజు ఇతర నిర్వాహకులని డీఎస్పీ వెల్లడించారు. చింతమనేనితో పాటు చాలామంది పరారీలో ఉన్నారన్నారు. పరారీలో ఉన్న వారి కోసం మూడు ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టాయన్నారు.

Updated Date - 2022-07-07T17:00:45+05:30 IST