ఛత్రపతి శివాజీ విగ్రహ ఆవిష్కరణలో పెను ప్రమాదం
ABN , First Publish Date - 2022-02-19T17:28:33+05:30 IST
ఛత్రపతి శివాజీ విగ్రహ ఆవిష్కరణలో పెను ప్రమాదం తప్పింది. టపాసులు పేల్చడంతో మంటలు టెంట్లకు అంటుకున్నాయి.
జగిత్యాల : ఛత్రపతి శివాజీ విగ్రహ ఆవిష్కరణలో పెను ప్రమాదం తప్పింది. టపాసులు పేల్చడంతో మంటలు టెంట్లకు అంటుకున్నాయి. టెంట్లు, కుర్చీలు కాలిపోయాయి. నర్సింగపూర్లో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఎమ్మెల్యే సంజయ్ కుమార్, జడ్పి చైర్మన్ వసంత ఆవిష్కరించారు. విగ్రహాన్ని ఆవిష్కరించిన తర్వాత సభా వేదికకు వెళ్తున్న సమయంలో ఘటన చోటు చేసుకుంది.