Electricity dues: ఏపీకి విద్యుత్ బకాయిలు వెంటనే చెల్లించండి.. తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం ఆదేశం
ABN , First Publish Date - 2022-08-30T02:35:42+05:30 IST
ఆంధ్రప్రదేశ్కు చెల్లించాల్సిన విద్యుత్ బకాయిలు రూ. 6 వేల 800 కోట్లు వెంటనే చెల్లించాలని తెలంగాణ)ను కేంద్రం ఆదేశించింది. పునర్విభజన చట్టంలోని...
న్యూఢిల్లీ (New Delhi): ఆంధ్రప్రదేశ్కు చెల్లించాల్సిన విద్యుత్ బకాయిలు (Andhra Pradesh Electricity dues) రూ. 6 వేల 800 కోట్లు వెంటనే చెల్లించాలని తెలంగాణ(Telangana)ను కేంద్రం ఆదేశించింది. పునర్విభజన చట్టంలోని సెక్షన్ 92 ప్రకారం ఆదేశాలు ఇస్తున్నామని కేంద్ర డిప్యూటీ సెక్రటరీ అనూప్ సింగ్ బిస్త్ (Central Deputy Secretary Anoop Singh Bist)తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (Cs)కి లేఖ రాశారు.
పునర్విభజన చట్టం ప్రకారం ఏపీ జెన్కో (Ap Genco) నుంచి 2014 నుంచి 2017 వరకూ సరఫరా చేసిన విద్యుత్కు తెలంగాణ డిస్కంలు బిల్లులు చెల్లించాలని లేఖలో పేర్కొన్నారు. 2014 మార్చి 28న జరిగిన సమావేశంలో ఏపీ నుంచి తెలంగాణకు విద్యుత్ సరఫరాపై నిర్ణయం తీసుకున్నామని గుర్తు చేశారు. ఇప్పటివరకూ రెండు ప్రభుత్వాల మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగినా తెలంగాణ చెల్లించలేదని తెలిపారు. 30 రోజుల్లోపు ఏపీకి విద్యుత్ బకాయిలు చెల్లించాలని సూచించారు. తెలంగాణ జెన్కో సీఎండీ (Ts Genco Cmd)తో పాటు రెండు రాష్ట్రాలకు చెందిన పలువురు అధికారులకు ఈ కాపీలు పంపారు.