తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే ఉచిత విద్య, వైద్యం: బండి సంజయ్

ABN , First Publish Date - 2022-03-06T19:34:05+05:30 IST

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే ఉచిత విద్య, వైద్యం అమలు చేస్తామని బండి సంజయ్ హామీ ఇచ్చారు.

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే ఉచిత విద్య, వైద్యం: బండి సంజయ్

హైదరాబాద్: తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే ఉచిత విద్య, వైద్యం అమలు చేస్తామని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ హామీ ఇచ్చారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ పార్లమెంట్‌ను గెలవడమే బీజేపీ లక్ష్యమన్నారు. జైలుకెళ్తామన్న భయంతోనే సీఎం కేసీఆర్ రాష్ట్రాల పర్యటనలు చేస్తున్నారని విమర్శించారు. బీజేపీకి అవకాశమిస్తే..ఓల్డ్ సిటీని న్యూసిటీగా చేసి చూపిస్తామన్నారు. పాతబస్తీలో హిందువుల ఘర్ వాపసీ కార్యక్రమం మొదలుపెడతామని స్పష్టం చేశారు. ఎంఐఎం గూండాల నుంచి తెలంగాణకు విముక్తి కల్పిస్తామన్నారు. యూనిఫాంతో మాత్రమే స్కూళ్లకు రావాలనడంలో తప్పేంటని ప్రశ్నించారు. ముస్లిం మహిళలు ఓటు హక్కు వినియోగించకుండా.. ఫత్వా జారీచేసే పరిస్థితికి ఎంఐఎం వచ్చిందని బండి సంజయ్‌ విమర్శించారు.

Updated Date - 2022-03-06T19:34:05+05:30 IST