Bandi sanjay: దేవరుప్పుల ఘటనతో పోలీసులపై బండి సంజయ్ ఫైర్‌

ABN , First Publish Date - 2022-08-15T18:31:28+05:30 IST

దేవరుప్పుల ఘటనతో పోలీసులపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Bandi sanjay:  దేవరుప్పుల ఘటనతో పోలీసులపై బండి సంజయ్ ఫైర్‌

జనగామ: దేవరుప్పుల ఘటనతో పోలీసులపై బీజేపీ (BJP) రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi sanjay) ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్‌ సెక్యూరిటీని నిరాకరించారు. భద్రతా సిబ్బందిని ఉపసంహరించుకోవాలని సంజయ్‌ నిర్ణయించారు. ‘‘నా భద్రతను మా కార్యకర్తలే చూసుకుంటారు’’ అంటూ బండి సంజయ్ స్పష్టం చేశారు. 


కాగా... బండి సంజయ్ పాదయాత్రలో ఉద్రికత్త చోటు చేసుకున్న విషయం తెలిసిందే. బండి సంజయ్‌ పాదయాత్రలో టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు హల్‌చల్‌ చేశారు. సంజయ్ ప్రసంగిస్తుండగా టీఆర్ఎస్ కార్యకర్తలు ఉద్యోగాలపై ప్రశ్నించారు. దీంతో టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఇరు వర్గాల మధ్య ఘర్షణ తోపులాటకు దారి తీసింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాల కార్యకర్తలను చెదరగొట్టారు. 

Updated Date - 2022-08-15T18:31:28+05:30 IST