బీజేపీ నిరసన దీక్ష భగ్నం
ABN , First Publish Date - 2022-02-13T20:06:20+05:30 IST
సికింద్రాబాద్ బన్సీలాల్పేట్లో బీజేపీ నిరసన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. రాజ్యాంగాన్ని మార్చాలన్న సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై
హైదరాబాద్: సికింద్రాబాద్ బన్సీలాల్పేట్లో బీజేపీ నిరసన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. రాజ్యాంగాన్ని మార్చాలన్న సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై బీజేపీ నిరసన దీక్ష చేపట్టింది. అయితే అనుమతి లేదంటూ దీక్షను పోలీసులు అడ్డుకున్నారు. దీక్షను పోలీసులు అడ్డుకోవడంపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు, బీజేపీ నేతలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. బీజేపీ నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు.
బీజేపీ కార్యకర్తల అరెస్ట్ను ఈ పార్టీ నేత బండి సంజయ్ ఖండించారు. ఆదివారం సంజయ్ మీడియాతో మాట్లాడుతూ రజాకార్ల పాలనను సీఎం కేసీఆర్ తలపిస్తున్నారని దుయ్యబట్టారు. రాజ్యాంగాన్నికేసీఆర్ అవమానించారని, ఆయన క్షమాపణ చెప్పేవరకు పోరాడుతామని బండి సంజయ్ ప్రకటించారు.