బీజేపీని తరిమేస్తేనే దేశం బాగుపడుతుంది: జగదీష్‌రెడ్డి

ABN , First Publish Date - 2022-02-22T00:05:24+05:30 IST

బీజేపీని తరిమేస్తేనే దేశం బాగుపడుతుందని మంత్రి జగదీష్‌రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ

బీజేపీని తరిమేస్తేనే దేశం బాగుపడుతుంది: జగదీష్‌రెడ్డి

హైదరాబాద్: బీజేపీని తరిమేస్తేనే దేశం బాగుపడుతుందని మంత్రి జగదీష్‌రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీ మిషన్ తెలంగాణా కాదని, తామే మిషన్ ఢిల్లీ మొదలు పెట్టామని ప్రకటించారు. ఢిల్లీలో బీజేపీని గద్దె దింపడానికి తమ కార్యక్రమం మొదలైందని తెలిపారు. ఏ మొఖం పెట్టుకుని బీజేపీ ప్రజల్లోకి వస్తుందని, దేశంలో ఏం అభివృద్ధి జరిగిందో బీజేపీ చెప్పాలని ప్రశ్నించారు. దళారీలను బాగు చేయడమేనా అభివృద్ధి అంటే.. బీజేపీ మిషన్లన్నీ బంగాళాఖాతంలో కలవాల్సిందేనని జగదీష్‌రెడ్డి పేర్కొన్నారు.



Updated Date - 2022-02-22T00:05:24+05:30 IST