కవ్వాల్ అభయారణ్యంలో బర్డ్ వాక్ ఫెస్టివల్
ABN , First Publish Date - 2022-02-10T07:39:45+05:30 IST
మైమరిపించే నీటి సరస్సులు.. సేద దీరేందుకు వెదురు
- 12, 13 తేదీల్లో జన్నారం అటవీ డివిజన్లో నిర్వహణ
మంచిర్యాల, ఫిబ్రవరి 9(ఆంధ్రజ్యోతి): మైమరిపించే నీటి సరస్సులు.. సేద దీరేందుకు వెదురు మంచెలు.. ప్రశాంతమైన ఇలాంటి వాతావరణా న్ని ఇష్టపడని వారుంటారా? కవ్వాల్ అభయారణ్యంలోని టైగర్ జోన్లో అధికారులు ఈ దిశగా ఏర్పాట్లు చేస్తున్నారు. మంచిర్యాల జిల్లా జన్నారం అటవీ డివిజన్లో 12, 13 తేదీల్లో బర్డ్ వాక్ ఫెస్టివల్ నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా అధికారులు చేస్తున్న ఏర్పాట్లు ప్రత్యేకాకర్షణగా నిలుస్తున్నాయి.
మైసమ్మకుంట, బైసన్కుంట, నీలుగాయికుంటతో పాటు కల్పకుంట, గోండుగూడ అటవీ ప్రాంతాల్లో పక్షి ప్రేమికుల బస కోసం ఏర్పా ట్లు చేస్తున్నారు. గరిష్ఠంగా 50 మందికి మాత్రమే బస ఏర్పాట్లు జరుగుతున్నాయి. బర్డ్వాక్లో పాల్గొనే ఔత్సాహికుల కోసం ముం దస్తు రిజిస్ట్రేషన్ ప్రారంభించగా.. రెండు గంటల్లోనే బుకింగ్ పూర్తయింది. రాత్రి వేళల్లో బస చేసేందుకు అటవీ ప్రాంతంలోని బేస్ క్యాంపుల వద్ద ఏర్పాట్లు చేస్తున్నారు.