Shravana masam: రాజన్న ఆలయంలో శ్రావణమాసం ప్రారంభం
ABN , First Publish Date - 2022-07-29T15:05:22+05:30 IST
ప్రసిద్ధి పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామి దేవాలయంలో శ్రావణమాసం ప్రారంభమైంది.
రాజన్న సిరిసిల్ల: ప్రసిద్ధి పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామి దేవాలయం (Sri Raja Rajeswara Swamy Temple)లో శ్రావణమాసం (Shravana masam) ప్రారంభమైంది. వేకువజాము నుంచే స్వామివారిని భక్తులు (Devotees) దర్శించుకుంటున్నారు. శ్రావణ మాసం సందర్భంగా ఆలయంలో స్వామి, అమ్మవారికి నెల రోజులపాటు ప్రత్యేక పూజలు చేయనున్నారు. దేవస్థానం అనుబంధ ఆలయం అయిన శ్రీ మహాలక్ష్మీ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రావణ మాసం సందర్భంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు ప్రత్యేక వసతులు కల్పించారు.