మంత్రి Sabita Indra reddy వ్యాఖ్యలపై విద్యార్థుల ఆగ్రహం
ABN , First Publish Date - 2022-06-16T15:45:38+05:30 IST
మంత్రి సబితా ఇంద్రారెడ్డి వ్యాఖ్యలపై బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిర్మల్: మంత్రి సబితా ఇంద్రారెడ్డి వ్యాఖ్యలపై బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమవి సిల్లీ డిమాండ్లు అని మంత్రి పేర్కొనడం దారుణమన్నారు. ‘‘హైదరాబాద్లో ఉండి మాట్లాడటం కాదు...ఇక్కడికి వచ్చి చూడాలి’’ అంటూ వ్యాఖ్యలు చేశారు. జిల్లా కలెక్టర్ తీరు బాగోలేదని, చర్చలకు పిలిచి బెదిరించారని విద్యార్థులు తెలిపారు.
మరోవైపు బాసర ఆర్జీయూకేటి(ట్రిపుల్ ఐటి) మెయిన్ గేటు వద్ద విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. విద్యార్థులు గేటు వైపు దూసుకురాకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. బారికేడ్లను ఏర్పాటు చేశారు. 12 డిమాండ్లతో గత మూడు రోజులుగా విద్యార్థులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే.