Basara IIIT: బాసర ట్రిపుల్ ఐటీ అధికారుల తీరుపై విద్యార్థుల ఆగ్రహం
ABN , First Publish Date - 2022-07-24T00:29:07+05:30 IST
బాసర ట్రిపుల్ ఐటీ (Basara IIIT) అధికారుల తీరుపై విద్యార్థులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలు నెరవేర్చక పోవడంపై విద్యార్థుల ఆగ్రహం వ్యక్తం చేశారు.

నిర్మల్: బాసర ట్రిపుల్ ఐటీ (Basara IIIT) అధికారుల తీరుపై విద్యార్థులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలు నెరవేర్చక పోవడంపై విద్యార్థుల ఆగ్రహం వ్యక్తం చేశారు. పీ1, పీ2 విద్యార్థులకు సెమిస్టర్ పరీక్షలు (Semester Examinations) కొనసాగుతున్నాయి. పరీక్షల సమయంలో మళ్లీ ఆందోళన చేయడంపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఇప్పటికే పరీక్షలు పూర్తైన ఈ3 బ్యాచ్కు అధికారులు సెలవులిచ్చారు. మరోవైపు బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల తల్లిదండ్రులతో అధికారుల సమావేశమయ్యారు. సమస్యల పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలను అధికారులు వివరించారు. దశలవారీగా అన్ని సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పిల్లలకు నచ్చజెప్పాలని తల్లిదండ్రులను అధికారులు కోరారు. మంత్రి హామీ ఇచ్చినా డిమాండ్లు నెరవేర్చకపోవడంపై పేరెంట్స్ అభ్యంతరం తెలిపారు.