లోక్‌సభ స్పీకర్‌కు బండి సంజయ్ లేఖ

ABN , First Publish Date - 2022-01-04T00:27:13+05:30 IST

లోక్‌సభ స్పీకర్‌కు బీజేపీ నేత బండి సంజయ్ లేఖ రాశారు. తనపై పోలీసులు వ్యవహరించిన తీరును లేఖలో వివరించారు.

లోక్‌సభ స్పీకర్‌కు బండి సంజయ్ లేఖ

కరీంనగర్‌: లోక్‌సభ స్పీకర్‌కు బీజేపీ నేత బండి సంజయ్ లేఖ రాశారు. తనపై పోలీసులు వ్యవహరించిన తీరును లేఖలో వివరించారు. ‘‘పోలీస్ కస్టడీ నుంచే మీకు లేఖ రాస్తున్నా. ఎంపీ అయిన నాకు సీపీ సత్యనారాయణ కనీస గౌరవం ఇవ్వలేదు. కరీంనగర్ సీపీ, ఇతర పోలీసులు అనుచితంగా వ్యవహరిస్తూ.. బలవంతంగా నన్ను అరెస్ట్ చేశారు. నన్ను అక్రమంగా అరెస్ట్ చేసిన సీపీపై చర్యలు తీసుకోవాలి’’ అని లేఖలో సంజయ్‌ కోరారు.


బండి సంజయ్‌పై కరీంనగర్ టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. కోవిడ్ నిబంధనల ఉల్లంఘన, పోలీసుల విధులకు ఆటంకం  కలిగించడంపై  బండి సంజయ్ సహా మొత్తం 12 మందిపై కేసులు నమోదు అయ్యాయి. ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయుల బదిలీల కోసం సర్కారు జారీ చేసిన జీవో 317ను సవరించాలనే డిమాండ్‌తో జిల్లాలోని ఎంపీ క్యాంప్ కార్యాలయంలో బండి సంజయ్‌ చేపట్టిన జాగరణ దీక్షను పోలీసులు భగ్నం చేసి.. అరెస్ట్ చేశారు.

Updated Date - 2022-01-04T00:27:13+05:30 IST