అక్బరుద్దీన్ను వదిలే ప్రసక్తే లేదు: బండిసంజయ్
ABN , First Publish Date - 2022-04-15T01:49:39+05:30 IST
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభమైంది. జోగులాంబ గద్వాల నుంచి పాదయాత్ర ప్రారంభించిన ఆయన బహిరంగ సభలో..
జోగులాంబ గద్వాల: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభమైంది. జోగులాంబ గద్వాల నుంచి పాదయాత్ర ప్రారంభించిన ఆయన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని చెప్పారు. మైనార్టీలంటే కేసీఆర్కు భయమని, కేసీఆర్ నిజమైన హిందువైతే అలంపూర్ ఆలయాన్ని ఎందుకు అభివృద్ధి చేయలేదని ప్రశ్నించారు. కేసులన్నీ తిరగదోడతామని, అక్బరుద్దీన్ను వదిలే ప్రసక్తే లేదని బండిసంజయ్ హెచ్చరించారు.