బీజేపీ కార్యకర్తలను అడ్డుకుంటే తీవ్ర పరిణామాలుంటాయ్: బండి సంజయ్
ABN , First Publish Date - 2022-05-26T17:46:23+05:30 IST
ప్రధాని మోదీ పర్యటన కోసం తాము పర్మిషన్ తీసుకున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు. బేగంపేట ఎయిర్ పోర్టులో వెల్ కమ్ చెప్పేందుకు సభ ఏర్పాటు చేశామన్నారు.
హైదరాబాద్ : ప్రధాని మోదీ పర్యటన కోసం తాము పర్మిషన్ తీసుకున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు. బేగంపేట ఎయిర్ పోర్టులో వెల్ కమ్ చెప్పేందుకు సభ ఏర్పాటు చేశామన్నారు. ఈ సభకు వచ్చే బీజేపీ కార్యకర్తలను అడ్డుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయన్నారు. పోలీసులు ఇష్టం వచ్చినట్టు వ్యవరిస్తే డీజీపీ ఆఫీస్కు ర్యాలీగా వెళ్లి ఆఫీసును ముట్టడిస్తామని బండి సంజయ్ హెచ్చరించారు. సమస్యలు ఉంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీని నేరుగా సీఎం కేసీఆర్ కలవొచ్చు కదా అని ప్రశ్నించారు. కేసీఆర్కు ఏం పీకుడు పని ఉందని బెంగళూరు పోయిండని ప్రశ్నించారు. కరీంనగర్లో నిన్న తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానన్నారు. కాశీలోనీ మసీదులో శివలింగం బయటపడ లేదా? అని ప్రశ్నించారు. తాను స్వయంగా బాబ్రీ మసీదు కర సేవలో పాల్గొన్నవాడినని.. ఆ టైమ్లో బాబ్రీ మసీదులో రామ శిలలు బయటపడ్డాయని వెల్లడించారు.