Bandi Sanjay : హీరాబెన్ మరణవార్త తీవ్రంగా బాధించింది
ABN , First Publish Date - 2022-12-30T10:40:31+05:30 IST
ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ మోదీ మరణించారన్న వార్త తనను తీవ్రంగా బాధించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు.
Bandi Sanjay : ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ మోదీ మరణించారన్న వార్త తనను తీవ్రంగా బాధించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు. శ్రీమతి హీరాబెన్ ఒక స్పూర్తి ప్రదాత అని ఆయన కొనియాడారు. మోదీ ఎంత బిజీగా ఉన్నా కూడా తల్లి కోసం సమయం కేటాయించి యోగక్షేమాలు చూసుకున్నారన్నారు. క్రమశిక్షణ, సమాజ హితం నేర్పి ఈ దేశానికి గొప్ప వ్యక్తిని, ధర్మ రక్షణ కోసం, దేశం కోసం అందించిన మహనీయ మాతృమూర్తి అని బండి సంజయ్ కొనియాడారు. హీరాబెన్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.