CM KCRపై బజరంగ్ దళ్ నేతల ఫిర్యాదు
ABN , First Publish Date - 2022-07-13T19:24:43+05:30 IST
ముఖ్యమంత్రి కేసీఆర్పై బజరంగ్ దళ్ నేతలు సుల్తాన్ బజార్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్(KCR)పై బజరంగ్ దళ్ నేతలు సుల్తాన్ బజార్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దేవి దేవతలను కించపరుస్తూ సీఎం కేసీఆర్ మాట్లాడారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో ఇటీవల జరిగిన బహిరంగ సభలో ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ(Narendra modi) తెలంగాణ(Telangana)లో ఉన్న ప్రముఖ దేవతలను కీర్తించారని, దీనిని రాజకీయంగా తప్పు పడుతూ జులై 10న నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్లో సీఎం కేసీఆర్ హిందూ దేవతలను కించపరిచేలా వ్యాఖ్యానించారని వీహెచ్పీ పేర్కొంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్పై తక్షణమే చర్యలు తీసుకోవాలని బజరంగ్ దళ్ నాయకుడు అభిషేక్ డిమాండ్ చేశారు.