పేదలను నిందించడం మోదీ విధానం: అసదుద్దీన్‌

ABN , First Publish Date - 2022-07-18T09:07:31+05:30 IST

పేదలను నిందించడం మోదీ విధానం: అసదుద్దీన్‌

పేదలను నిందించడం మోదీ విధానం: అసదుద్దీన్‌

హైదరాబాద్‌, జూలై 17(ఆంధ్రజ్యోతి): పేదలను నిందించడమే ప్రధాని మోదీ విధానమంటూ మజ్లిస్‌ పార్టీ అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ మండిపడ్డారు. ప్రధాని మోదీ పేద ప్రజలకు ‘‘ఉచితాలు’’ మంచిది కాదని చేసిన వ్యాఖ్యలపై ఒవైసీ స్పందిస్తూ.. ధనంతులకు రాయితీలు, మినహాయింపులు కల్పించి పేదలను నిందిస్తున్నారని విమర్శించారు. ఇది  క్రీమి క్లాస్‌కు పంపిణీ చేసే నిజమైన రేవడి మిఠాయ్‌గా ట్విటర్‌లో ఒవైసీ  అభివర్ణించారు. 

Updated Date - 2022-07-18T09:07:31+05:30 IST