‘ఆందోళ్ మైసమ్మ’ షాపుల వేలం
ABN , First Publish Date - 2022-11-06T00:13:53+05:30 IST
చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం సమీపంలోని ఆందోళ్మైసమ్మ దేవస్థానం పరిధిలోని వివిధ షాపుల నిర్వహణ కోసం సీల్డ్, బహిరంగవేలం నిర్వహించనున్నట్లు ఈవో చిట్టెడి వెంకట్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
చౌటుప్పల్ రూరల్, నవంబరు 5: చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం సమీపంలోని ఆందోళ్మైసమ్మ దేవస్థానం పరిధిలోని వివిధ షాపుల నిర్వహణ కోసం సీల్డ్, బహిరంగవేలం నిర్వహించనున్నట్లు ఈవో చిట్టెడి వెంకట్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. కొబ్బరికాయలు, పూజసామగ్రి విక్రయం, టెంట్హౌస్ సామగ్రి సరఫరా, కిరాణం జనరల్ స్టోర్ల నిర్వహణకు వేలంపాటలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అసక్తిగలవారు కార్యాలయంలో సంప్రదించాలన్నారు.