బడ్జెట్ లెక్కలన్నీ మాయే: భట్టి విక్రమార్క
ABN , First Publish Date - 2022-03-08T01:26:55+05:30 IST
అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లెక్కలన్నీ మాయేనని
హైదరాబాద్: అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లెక్కలన్నీ మాయేనని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. వాస్తవాలకు దూరంగా బడ్జెట్ ఉందన్నారు. ఏ వర్గానికి ఉపయోగం లేని బడ్జెట్ ఇది అని ఆయన పేర్కొన్నారు. గవర్నర్తో తగాదాలుంటే మీరు మీరు చూసుకోవాలని, రాష్ట్ర ప్రజలకు గవర్నర్ ఇచ్చే రిపోర్ట్ను ఎత్తేస్తారా అని ఆయన నిలదీశారు. పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తినా స్పీకర్ స్పందించలేదన్నారు. స్పీకర్ విధానం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టని ఆయన ఆరోపించారు.