TS News: ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో పర్యటించిన కేంద్ర బృందం
ABN , First Publish Date - 2022-07-23T00:08:56+05:30 IST
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో కేంద్ర బృందం పర్యటించింది. కేంద్ర బృందం ఆదిలాబాద్ (Adilabad) జిల్లాలోని ఉట్నూర్, ఇంద్రవెల్లి, ఇచ్చోడ
ఆదిలాబాద్: ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో కేంద్ర బృందం పర్యటించింది. కేంద్ర బృందం ఆదిలాబాద్ (Adilabad) జిల్లాలోని ఉట్నూర్, ఇంద్రవెల్లి, ఇచ్చోడ, నేరడిగొండ మండలాల్లో ముంపు ప్రాంతాలను పరిశీలించి పంట నష్టంపై ఆరా తీసింది. ఉట్నూర్ మండల కేంద్రంలో పవర్ ప్రజంటేషన్ ద్వారా వరదల ఉధృతి, పంట నష్టాన్ని పరిశీలించింది. ఇచ్చోడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద తెగిపోయిన బ్రిడ్జిని పరిశీలించింది. అలాగే నేరడిగొండ మండలంలోని కుప్టి గ్రామం వద్ద కడెం నది పరివాహక ప్రాంతంలోని ముంపు పంట భూములను పరిశీలించి రైతులతో అధికారులు మాట్లాడారు. జరిగిన నష్టాన్ని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ను అడిగి తెలుసుకున్నారు. నిర్మల్ జిల్లా (Nirmal District)లోనూ కేంద్ర బృందం సభ్యులు పర్యటించారు. జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీతో కలిసి కడెం ప్రాజెక్టు (Kadem project)ను సందర్శించారు.