విద్యుత అధికారులపై కేసు నమోదు

ABN , First Publish Date - 2022-11-08T00:43:39+05:30 IST

మండలంలోని గట్టుసింగారంలో ఈ నెల 4న విద్యుత ఘాతం కారణంగా ఎద్దు మృతి చెందింది.

 విద్యుత అధికారులపై కేసు నమోదు

అడ్డగూడూరు, నవంబరు 7: మండలంలోని గట్టుసింగారంలో ఈ నెల 4న విద్యుత ఘాతం కారణంగా ఎద్దు మృతి చెందింది. అదే గ్రామానికి చెందిన మద్ది మురళికి తీవ్ర గాయాలయ్యాయి. విద్యుత అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ సంఘటన చోటు చేసుకోవడంతో బాధితుని సోదరుడు వెంకన్న సోమవారం స్ధానిక పోలిసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ ఉద య్‌ కిరాణ్‌ తెలిపారు.

Updated Date - 2022-11-08T00:43:43+05:30 IST