తండ్రిని గుర్తుచేసుకుని Purandeshwari భావోద్వేగం

ABN , First Publish Date - 2022-05-28T13:48:37+05:30 IST

స్వర్గీయ నందమూరి తారకరామారావు శత జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్‌లో ఎన్టీఆర్ కుమార్తెలు, కుమారులు నివాళులర్పించారు.

తండ్రిని గుర్తుచేసుకుని Purandeshwari భావోద్వేగం

హైదరాబాద్: స్వర్గీయ నందమూరి తారకరామారావు(Nandamuri Tarakaramaravu) శత జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్‌(NTR Ghat‌)లో ఆ మహనీయుడి కుమార్తెలు, కుమారులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా తండ్రిని గుర్తుచేసుకుని కుమార్తె దగ్గుబాటి పురందేశ్వరి(Daggubati purandeshwari) భావోద్వేగానికి గురయ్యారు. నందమూరి తారక రామారావు ఒక సంచలనం.. ప్రభంజనమన్నారు. తెలుగు రాష్ట్రాల్లో వచ్చే ఏడాది మే 28 వరుకు శతజయంతి ఉత్సవాలు చేయనున్నట్లు తెలిపారు. రెండు రాష్ట్రాల్లో 12 కేంద్రాల్లో శత జయంతి ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు. శత జయంతి ఉత్సవాలు నిర్వహించటానికి ఒక కమిటీని ఏర్పాటు చేశామని అన్నారు. కమిటీలో బాలకృష్ణ, రాఘవేంద్రరావు, రాజేంద్రప్రసాద్, పరుచూరి వంటి ప్రముఖులు ఉన్నారని చెప్పారు. ఎన్టీఆర్ ఫోటోను వంద రూపాయల నాణెంపై ముద్రణ చేయాలనే ఆలోచనతో ఆర్బీఐతో మాట్లాడుతున్నామని అన్నారు. అన్ని రంగాలలో నిష్ణాతులైన కళాకారులని ఘనంగా సత్కారం చేస్తామని దగ్గుబాటి పురందేశ్వరి పేర్కొన్నారు. 


Updated Date - 2022-05-28T13:48:37+05:30 IST