గచ్చిబౌలి కేంద్రంగా రియల్టర్ల పేకాట.. 12 మంది అరెస్ట్
ABN , First Publish Date - 2022-01-22T17:05:41+05:30 IST
భారీ పేకాట గ్యాంగ్నుపోలీసులు అరెస్ట్ చేశారు. పక్కా సమాచారంతో నిందితులను మాదాపూర్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్: భారీ పేకాట గ్యాంగ్నుపోలీసులు అరెస్ట్ చేశారు. పక్కా సమాచారంతో నిందితులను మాదాపూర్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గచ్చిబౌలి కేంద్రంగా పేకాట స్థావరం నడుపుతున్న కాకర్ల మర్కారెడ్డితో పాటు పన్నెండు మంది రియల్టర్లను అరెస్ట్ చేశారు. తొమ్మిది లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. రోజుకు ఆరు వేలు చెల్లించి ఫ్లాట్ను అద్దెకు తీసుకుని పేకాట కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. నిందితుల్లో అంబర్ పేటకు చెందిన మర్కారెడ్డితో పాటు అల్వాల్కు చెందిన పాపిరెడ్డి, ఎల్బీనగర్కు చెందిన కార్తీక్ గౌడ్, మెతుకు సంతోష్, సంతోష్ నగర్కు చెందిన సతీష్, సిద్దిపేటకు చెందిన స్లీర రెడ్డి, ఓల్డ్ అల్వాల్కు చెందిన వెంకట నర్సింహరాజు, మెదక్కు చెందిన రామయ్య, బీరంగూడ సద్గురు రెడ్డి, సంద కృష్ణ, గండిపేట అప్పలరాజు ఉన్నారు.