TS News: కరెంట్ ఉండగానే తెగిపడ్డ 11కేవీ విద్యుత్ తీగలు

ABN , First Publish Date - 2022-08-16T16:11:57+05:30 IST

జిల్లాలోని చిట్యాల మండలం శాంతి నగర్‌లో పెను ప్రమాదం తప్పింది. కరెంట్ ఉండగానే 11 కేవీ విద్యుత్ తీగలు తెగిపడ్డాయి.

TS News: కరెంట్ ఉండగానే తెగిపడ్డ 11కేవీ విద్యుత్ తీగలు

జయశంకర్ భూపాలపల్లి: జిల్లాలోని చిట్యాల మండలం శాంతి నగర్‌లో పెను ప్రమాదం తప్పింది. కరెంట్ ఉండగానే 11 కేవీ విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. అయితే ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. అయి విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమం వల్లే విద్యుత్ తీగలు తెగిపడ్డాయని గ్రామస్తులు ఆరోపించారు. అధికారుల తీరుకు వ్యతిరేకంగా గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. 

Updated Date - 2022-08-16T16:11:57+05:30 IST